ఇయ్యాల్టి నుంచి గ్రూప్​1 హాల్​టికెట్లు

ఇయ్యాల్టి నుంచి గ్రూప్​1 హాల్​టికెట్లు

హైదరాబాద్, వెలుగు : పేపర్​ లీకేజీలతో రద్దయిన గ్రూప్​ 1 ప్రిలిమ్స్ కు రీ–ఎగ్జామ్​కు సంబంధించి ఆదివారం నుంచి అభ్యర్థులు హాల్​టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. నిరుడు అక్టోబర్​లో నిర్వహించిన పరీక్షకు కేటాయించిన హాల్​ టికెట్లు చెల్లవని, కొత్తవి డౌన్​లోడ్​ చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో అభ్యర్థులకు సూచించింది.

చివరి నిమిషంలో కాకుండా ముందుగానే హాల్​టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 11న ఉదయం 10.30 గంల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుంది. కాగా, నిరుడు అక్టోబర్​ 16న నిర్వహించిన పరీక్షకు సంబంధించి పేపర్​లీక్​ కావడంతో..  ఆ ఎగ్జామ్​ను ఈ ఏడాది మార్చి 17న టీఎస్​పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జూన్​ 11న పరీక్ష నిర్వహిస్తామని ఆ రోజే ప్రకటించింది.