గుజరాత్లో ఒకేరోజు ముగ్గురు సీఎంల ర్యాలీలు
గాంధీనగర్: గుజరాత్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలకు నోటిఫికేషన్ రాకుండానే పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. సోమవారం ఏకంగా మూడు రాష్ట్రాలకు చెందిన సీఎంలు గుజరాత్లో ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్లు వివిధ ర్యాలీల్లో పాల్గొని మాట్లాడనున్నారు. భావ్నగర్లోని పాలిటానా, రాజ్కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగే రెండు ర్యాలీల్లో కేజ్రీవాల్, మాన్ పాల్గొననున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ బనస్కాంతలోని విరాంపూర్, సబర్కాంత జిల్లాలోని ఖేద్బ్రహ్మ, ఆరావళి జిల్లాలోని భిలోడాలో జరిగే ర్యాలీలకు హాజరవుతారు.