మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి

మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి

ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మరణించాడు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య విధులు నిర్వహిస్తున్నారు. జూన్ 29వ తేదీ గురువారం ఉదయం తన గన్ ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో బులెట్ అతని శరీరంలోకి దూసుకెళ్లింది. 

తీవ్ర రక్తస్రావం అవుతున్న రామయ్యాను అధికారులు నాంపల్లి లోని కేర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. కాగా, కానిస్టేబుల్ రామయ్యది మంచిర్యాల అని అధికారులు తెలిపారు.