
- కాంట్రాక్ట్ బేసిస్లో రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్ నియామకం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్ గుర్రం మల్సూర్ నియమితులయ్యారు. ఆయనను కాంట్రాక్ట్ బేసిస్లో నియమించారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్- 1 అధికారిగా చేరిన మల్సూర్.. తెలంగాణలో సుదీర్ఘ సేవలందించి గత నెల 31న పదవీ విరమణ చేశారు.
ఆయన బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో, మున్సిపల్ శాఖలో విధులు నిర్వర్తించారు. నీటిపారుదల శాఖలో వరల్డ్ బ్యాంక్, జైకా ప్రాజెక్టులను పర్యవేక్షించారు. టీఎస్ఎండీసీ వైస్ చైర్మన్ అండ్ఎండీగా సేవలందించారు.