స్మశానం ముందు గురుకుల పీఈటీ అభ్యర్థుల నిరసన

స్మశానం ముందు గురుకుల పీఈటీ అభ్యర్థుల నిరసన

హైకోర్టు తీర్పును అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను తక్షణమే విడుదల చేయాలంటూ అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని స్మశాన వాటిక ఎదుట ఆందోళనకు చేపట్టారు. ప్ల కార్డులు పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. టీఎస్పీఎస్సీ వెంటనే గురుకుల పీఈటీ మెరిట్ లిస్ట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే కుటుంబాలతో సహా స్మశానాలకే పరిమితం కావాల్సి వస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.