శానిటైజర్ తాగిన గురుకుల స్టూడెంట్​

శానిటైజర్ తాగిన గురుకుల స్టూడెంట్​

అమ్రాబాద్, వెలుగు: గురుకుల స్కూల్​లో టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్ శానిటైజర్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్​లో మంగళవారం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారానికి చెందిన బాబు దంపతుల కూతురు శిరీష(16) మన్ననూర్ రెసిడెన్షియల్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతోంది. గత నెల 28న హాస్టల్ కు వచ్చిన శిరీష మంగళవారం ఉదయం తనతో తెచ్చుకున్న శానిటైజర్ తాగింది. ఇది గమనించిన మిగతా స్టూడెంట్లు ప్రిన్సిపల్ కి ఇన్ఫామ్ చేయడంతో.. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటం, తనకు పెండ్లి చేయాలనే ప్రయత్నం వల్లే శిరీష మనస్తాపంతో ఇలా చేసినట్లు చెప్పిందని ప్రిన్సిపల్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం అమ్మాయికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ఈ ఘటనపై బాలిక తండ్రి బాబును ప్రశ్నించగా.. ‘తమకు ఒక్కతే కూతురని, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయాలనే ఆలోచన మాకు లేదు. ప్రిన్సిపల్ తమపై ఆరోపణలు చేస్తున్నారు’ అని చెప్తున్నారు.