ఆ ఇద్దరు ఎంపీల పనితీరు బాగా లేదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

ఆ ఇద్దరు ఎంపీల పనితీరు బాగా లేదు :  గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ  : నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మీద సర్వే చేయిస్తే వాళ్ల పనితీరు బాగాలేదని వచ్చింద ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఇవాళ న ల్గొండలో మీడియా చిట్ చాట్ లో  ఆయన మాట్లాడారు. ఇద్దరు ఎంపీ ల పనితీరు బాగోలేదని 69 శాతం మంది ప్రజలు  చెప్పారని గుత్తా తెలి పారు. జిల్లా ప్రాజెక్టులు, వాటి ప్రగతిపై ఈ ఎంపీలకు ఏమీ తెల్వకుండా  ఏది పడితే అది మాట్లాడతారని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు ఎంపీ టికెట్ ఇవ్వకుండా తనకు అన్యాయం చేయడం వల్లే ఆనాడు వైఎస్సార్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు.  ఆ తర్వాత  జిల్లాలోని కాంగ్రెస్ సీని యర్లతో ఏగలేక, వాళ్ల పోరుపడలేకనే కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో  చేరారని గుత్తా వివరించారు. రాజకీయంగా కాంగ్రెస్ లో రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన తనకు,  బీఆర్ఎస్లో కూడా కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని చెప్పారు.