మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై గువ్వల బాలరాజు అసహనం

 మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై గువ్వల బాలరాజు అసహనం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. క్రీడాకారులు, కళాకారులకు ఇండ్ల  స్థలాల పట్టాల పంపిణీకి తనని పిలవకపోవడాన్ని తప్పుబట్టారు. కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలాలు ఇచ్చి,  మొగులయ్యకు మాత్రం నగర శివారు ప్రాంతమైన బీఎన్ రెడ్డి కాలనీలో జాగా ఇవ్వడంపై ఆయన సీరియస్ అయ్యారు. మొగులయ్యను ఢిల్లీకి తీసుకెళ్లి అతని కళను అందరికీ పరిచయం చేసింది తానేనని గువ్వల బాలరాజు గుర్తు చేశారు. తనకు జరిగిన అవమానాన్ని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.