గొంతు కొరికి, మర్మాంగాలు కోసి తండ్రిని చంపిన కొడుకు

గొంతు కొరికి, మర్మాంగాలు కోసి తండ్రిని చంపిన కొడుకు
  • మహారాష్ట్రలో దారుణానికి పాల్పడ్డ జిమ్ ట్రైనర్

నాగ్​పూర్: పాతికేళ్ల జిమ్ ట్రైనర్ తన తండ్రిని అత్యంత దారుణంగా, పైశాచికంగా హత్య చేశాడు. సినిమా డైలాగ్స్ చెప్తూ గొంతు కొరికి, మర్మాంగాలు కోసేసి తండ్రిని చంపేశాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగ్​పూర్ హుద్కేశ్వర్ ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అయిన విక్రాంత్ పిల్లే శనివారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడని వివరించారు. అతను చాలా హింసాత్మకంగా ప్రవర్తించాడని, దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒక అధికారి చెప్పారు.

ఎటువంటి కారణం లేకుండానే విక్రాంత్ కోపం తెచ్చుకుని రెచ్చిపోయాడు. తండ్రి విజయ్(55) మెడ గట్టిగా కొరికాడు. దాంతో తండ్రి మెడ నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత వరండాలోకి ఈడ్చుకెళ్లి మర్మాంగాలను కోసివేశాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు అధికారులు వివరించారు. దీంతో విజయ్ అక్కడికక్కడే చనిపోయాడని చెప్పారు. విక్రాంత్ ఆ సమయంలో హిందీ సిన్మా డైలాగ్స్ చెప్తూ చాలా వింతగా ప్రవర్తించాడని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి, సోదరిని కూడా బెదిరించాడని తెలిపారు. అతన్ని అరెస్టు చేసేందుకు ఐదుగురు పోలీసులు శ్రమించాల్సి వచ్చిందని హుడ్కేశ్వర్ పీఎస్ ఇనిస్పెక్టర్ రాజ్​కమల్ అన్నారు.