హంద్వారా ఎన్ కౌంటర్ ముగింపు దశకు వచ్చిందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సీఆర్పీఎఫ్, ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. శుక్రవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ మొదలైంది. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో నార్త్ కశ్మీర్ లో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫైరింగ్ లో మొత్తం 9 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ఎన్ కౌంటర్ ప్రాంతంలో స్థానికులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆపరేషన్ నెమ్మదిగా కొనసాగిందని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
The encounter between terrorists and security forces in Babagund, Handwara area enters third day. Two CRPF personnel and two Jammu and Kashmir police personnel have lost their lives so far. Operation underway. pic.twitter.com/D5rIaSC2Tw
— ANI (@ANI) March 3, 2019