హంద్వారా ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన జవాన్లు

హంద్వారా ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన జవాన్లు

హంద్వారా ఎన్ కౌంటర్ ముగింపు దశకు వచ్చిందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సీఆర్పీఎఫ్, ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. శుక్రవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ మొదలైంది. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో నార్త్ కశ్మీర్ లో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్పటి నుంచి ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫైరింగ్ లో మొత్తం 9 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ఎన్ కౌంటర్ ప్రాంతంలో స్థానికులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆపరేషన్ నెమ్మదిగా కొనసాగిందని అధికారులు క్లారిటీ ఇచ్చారు.