కరెట్ షాక్ తల్గిన ఏనుగును కాపాడిన్రు..శభాష్:మోడీ

కరెట్ షాక్ తల్గిన ఏనుగును కాపాడిన్రు..శభాష్:మోడీ

కరెంట్ షాక్ తగిలి విలవిలలాడుతున్న గజరాజు ప్రాణాలు కాపాడినందుకు గానూ కర్ణాటకలోని బందిపుర టైగర్ రిజర్వ్ సిబ్బందిని ప్రధాని మోడీ ప్రశంసించారు. సమయానికి స్పందించి చికిత్సనందించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూడడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ మోడీ ట్వీట్ చేశారు. సమయస్ఫూర్తితో ఏనుగు ప్రాణాలు కాపాడిన సిబ్బందిని అభినందించారు. దాంతో పాటు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ షేర్ చేసిన గజరాజు ఫొటోలు, వీడియోలను కూడా రీట్వీట్ చేశారు. ఇటీవల బందిపుర టైగర్ రిజర్వ్ లో ఓ ఆడ ఏనుగు విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ ఏనుగుకు చికిత్స అందించారు. అనంతరం గజరాజును అడవిలో వదిలిపెట్టారు. ఏనుగు రెస్క్యూ ఆపరేషన్ వీడియోలను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. దీంతో నెటిజన్లు అటవీ సిబ్బందిని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు.