మాదాపూర్, వెలుగు: ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, లేదంటే నీ అంతు చూస్తా’’ అంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని వేధిస్తున్న యువకుడిపై మాదాపూర్పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. కొంపల్లిలో ఉండే యువతి(24) ఏడాది క్రితం తిరుమలగిరి పోలీస్ స్టేషన్పరిధిలోని 24/7 క్యాబ్స్ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేసేది. ఆ సమయంలో ఘట్కేసర్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన అఖిల్ అదే కంపెనీలో క్యాబ్స్ సూపర్వైజర్. అప్పటి నుంచి అఖిల్తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతులను వేధింపులకు గురిచేసేవాడు. 11 నెలల క్రితమే యువతి తిరుమలగిరి పీఎస్లో అఖిల్పై ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె మాదాపూర్ పీఎస్పరిధిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్చేస్తుంది. కానీ అఖిల్నుంచి ఆమె వేధింపులు ఆగలేదు. ఆమె పనిచేసే కంపెనీ వద్దకు వచ్చి పెళ్లి చేసుకోవాలని, లేదంటే నీ అంతూ చూస్తానని బెదిరిస్తున్నాడు. ఫోన్చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. తట్టుకోలేకపోయిన బాధితురాలు శనివారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై హారిక అఖిల్ పై 354, 354ఎ, 354డి,504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.