రాష్ట్ర బడ్జెట్ రూ. 1, 82,914 కోట్లు

రాష్ట్ర బడ్జెట్ రూ. 1, 82,914 కోట్లు

ఆర్థిక మంత్రిగా హరీష్ రావు తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 1,82,914 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  బడ్జెట్ అంటే కాగితాల మీద రాసుకునే అంకెలు కాదన్నారు. వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు.  కేంద్ర నుంచి రావాల్సిన  పన్నుల వాటా తగ్గిందన్నారు.

2020-21 బడ్జెట్ 1,82,914.42 కోట్లు

  • రెవెన్యూ వ్యయం- 1, 38, 669.82 కోట్లు
  • క్యాపిటల్ వ్యయం-  22,061.18 కోట్లు
  • రెవెన్యూ మిగులు- 4,482.12 కోట్లు
  • ఆర్థిక లోటు- 33,191.25 కోట్లు

బడ్జెట్ కేటాయింపులు

  • గృహ నిర్మాణాల కోసం 11,917 కోట్లు
  • ఆర్టీసీ కి వెయ్యి కోట్లు
  • పారిశ్రామిక రంగం అభివృద్ధికి 1998 కోట్లు
  • విద్యుత్ శాఖ కు 10416 కోట్లు
  • వైద్య రంగానికి 6,186 కోట్లు
  • ఉన్నత విద్యకు 1723కోట్లు
  • పాఠశాల విద్య కు 10,421కోట్లు
  • ఫీజు రీయింబర్స్ మెంట్ కు 2650కోట్లు
  •  మున్సిపల్ శాఖ కు 14,809 కోట్లు
  • సాగునీటికి 11054కోట్లు
  • పంచాయతీ రాజ్ కు, గ్రామీణాభవృద్ధికి 23005 కోట్లు
  • ఆసరా ఫెన్షన్లు కు 11758కోట్లు
  • ఎంబిసి కార్పొరేషన్ కి 500కోట్లు
  • వెనకబడిన వర్గాల సంక్షేమ కోసం 4356 కోట్లు