ఏపీలో ఓటు హక్కును రద్దు చేసుకోండి: హరీశ్ రావు

ఏపీలో ఓటు హక్కును రద్దు చేసుకోండి: హరీశ్ రావు

మేడే రోజున కార్మికులు కేసీఆర్ నోట మరి కొన్ని  శుభవార్తలు వింటారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ ..ఏపీలో రోడ్లు, ధవఖాన్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు. ఏపీ,తెలంగాణకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తెలంగాణలో ఉన్న ఆంద్రా కార్మికులు ఏపీలో ఓటు హక్కును క్యాన్సిల్ చేసుకుని.. ఇక్కడే ఓటు హక్కు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అయ్యే ప్రతి కార్మికుడు రాష్ట్రంలో అంతర్భాగమేనని హరీశ్ అన్నారు. 

ఏపీకి తెలంగాణకు వ్యత్యాసం ఇదే

తెలంగాణలో  మోటార్ల దగ్గర మీటర్లు పెట్టకపోవడంతో కేంద్రం 30 వేల కోట్ల రూపాయలను నిలిపివేసిందని హరీశ్ రావు అన్నారు. అదే ఏపీలో మోటార్ల దగ్గర మీటర్లు పెట్టి30 వేల కోట్ల రూపాయలు తెచ్చుకుందని ఆరోపించారు. ఏపీకి, తెలంగాణకు ఉన్న తేడా ఇదేనని చెప్పారు.