ప్రజా సేవకు పదవితో పనిలేదు: హరీశ్ రావు

ప్రజా సేవకు పదవితో పనిలేదు: హరీశ్ రావు

ప్రజా సేవ చేయడానికి పదవులే అవసరం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పనిచేయాలని ఉంటే ఎలాగైనా చేయవచ్చన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదన్నారు.

సంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ రాజమణి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ వీడ్కోలు పదవికే కానీ.. మన సంబంధాలు,  ప్రజా సేవకు కాదన్నారు. మంచిగా ఆలోచించండి..మంచిగా జీవించండి అని చెప్పారు. పదవి కాలంలో మనం చేసిన మంచి పనులే ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. దశాబ్దాల కాలంలో జరగని పనులు మీ హయాంలో జరగడం సంతోషన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో కరెంట్ సమస్య లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి హరీశ్ . సీఎం కేసీఆర్ అడిగినన్ని ట్రాన్స్ ఫార్మర్‌లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో మంచి నీటి సమస్య బాగా ఉండేదని… మిషన్ భగీరథ వచ్చాక 90 శాతం సమస్య తీరిందన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ మంచి అవకాశాలుంటాన్నారు హరీశ్.