అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు డిమాండ్ చేస్తలే : ఎమ్మెల్యే హరీశ్ రావు

అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు డిమాండ్ చేస్తలే : ఎమ్మెల్యే  హరీశ్ రావు
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే  హరీశ్​ రావు 

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల బాగోతం ఢిల్లీలో సీఎం రేవంత్​ రెడ్డి మాటలతో బయటపడిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే  హరీశ్​ రావు అన్నారు. చంద్రబాబుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే చాలన్న పల్లవిని ఎత్తుకున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కేబినెట్ మీటింగ్​ ఏర్పాటు, చంద్రబాబుతో చర్చల ప్రతిపాదన ముందే కుదుర్చుకున్న మ్యాచ్​ ఫిక్సింగ్​లో భాగమన్నారు. గోదావరిలో 2,918 టీఎంసీలు కావాలని కేసీఆర్​ అడిగితే.. రేవంత్​ వెయ్యి టీఎంసీలకే పరిమితం చేస్తున్నారన్నారు. 

కృష్ణా జలాల్లో 763 టీఎంసీల వాటా కోసం ట్రిబ్యునల్​ ముందు పోరాడితే.. రేవంత్​ 500 టీఎంసీలతో సరిపెట్టాలనుకోవడం తెలంగాణను నిండా ముంచడమేనన్నారు. అపెక్స్​ కౌన్సిల్​కు డిమాండ్​ చేయకపోవడం, చంద్రబాబుతో చర్చలు చేస్తామనడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు.  మరోవైపు, యాసంగిలో సన్న వడ్ల కొనుగోళ్లు పూర్తయినా ప్రభుత్వం ఇంకా బోనస్​ విడుదల చేయకపోవడం దుర్మార్గమని హరీశ్​ రావు విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించినా.. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా బోనస్​ ఇవ్వలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.