మదన్​రెడ్డితో హరీశ్​రావు​ భేటీ

మదన్​రెడ్డితో హరీశ్​రావు​ భేటీ

కౌడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్​కు చెందిన నర్సాపూర్​మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్​రెడ్డి కాంగ్రెస్​లోకి  వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనతో భేటీ అయ్యారు.

సంగారెడ్డి నుంచి మెదక్​ వెళ్లే క్రమంలో హరీశ్​ రావు​, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్​ హుస్సేన్, ఎమ్మెల్సీ, మెదక్ లోక్​ సభ బీఆర్​ఎస్​అభ్యర్థి వెంకటరామిరెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీత రెడ్డి కౌడిపల్లిలోని మదన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దాదాపు 20 నిమిషాల పాటు హరీశ్​రావు​ఆయనతో మాట్లాడారు. పార్టీ మార్పు గురించి జరుగుతున్న ప్రచారం గురించి చర్చించినట్టు తెలిసింది.