
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం మెంగారం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ ప్రకాశ్ జాదవ్ తెలిపారు. యాదాద్రి జిల్లా ముట్టికుంటతండాకు చెందిన తేజావత్దేవా అనే వ్యక్తి మహీంద్ర వెహికల్ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ, తనిఖీలో పట్టుబడ్డాడని పేర్కొన్నారు. బియ్యంతో పాటు అతడి వెహికల్ను సీజ్చేసి, కేసు నమోదు చేసినట్లు చెప్పారు.