శ్వాగ్.. ల్యాండ్‌‌ మార్క్‌‌ సినిమా అవుతుంది

శ్వాగ్.. ల్యాండ్‌‌ మార్క్‌‌ సినిమా అవుతుంది

శ్రీవిష్ణు, రీతూ వర్మ లీడ్ రోల్స్‌‌లో హసిత్ గోలి తెరకెక్కించిన చిత్రం ‘శ్వాగ్‌‌’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్.   గురువారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.  హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘కథ విన్న రోజునే ఈ సినిమా చేయడం నా అదృష్టం అనుకున్నా. ఇండియన్ సినిమాలో ఇలాంటి కంటెంట్‌‌తో సినిమా రాలేదు. ఆడ,  మగలో ఎవరు గొప్ప అనేది మెయిన్ కాన్సెప్ట్‌‌. 

 తరతరాలుగా మన కుటుంబాల్లో చూస్తున్నదే. కానీ  సినిమాగా రాలేదు.  ఇది చూశాక ఇతర భాషల వాళ్లు ఆశ్చర్యపోతారు. అలాంటి దిమ్మతిరిగిపోయే కంటెంట్‌‌ ఇందులో ఉంది.  ఇందులో ఐదు పాత్రలు పోషించా.  తెరపై నేను కాకుండా పాత్రలే కనిపిస్తాయి’ అని చెప్పాడు.  దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ ‘మాతృస్వామ్య వ్యవస్థ ఉన్న కాలం నుంచి కలికాలం వరకు  ఐదు కాలాల్లో జరిగే కథ ఇది. తాతలతో కలిసి చూడదగ్గ రూటెడ్ స్టోరీ. 

నాకు అవకాశం వస్తే ఈ కథను కమల్ హాసన్‌‌ గారితోనే చేసేవాడిని. అయితే ఈ పాత్రకు తెలుగులో శ్రీవిష్ణు గారిని మించిన నటుడు నాకు కనిపించలేదు.  టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘రాజరాజచోర తర్వాత శ్రీవిష్ణు,  హసిత్ కాంబినేషన్‌‌లో మేము చేస్తున్న రెండో చిత్రమిది.  కంటెంట్ డ్రైవెన్ వెరైటీ మూవీ ఇది. 

 కమల్ హాసన్ గారి ఇంద్రుడు చంద్రుడు,  మైఖెల్ మదన కామరాజు ఎంతలా ఇన్‌‌ఫ్లూయెన్స్ చేసిందో అలాంటి ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఈ చిత్రం అందిస్తుంది.  సక్సెస్ మాత్రమే కాకుండా కొన్ని  తరాలు గుర్తుండిపోయే ల్యాండ్‌‌ మార్క్‌‌ సినిమా అవుతుంది’ అని చెప్పారు.