
నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హవీష్.. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘నేను రెడీ’అనే టైటిల్ను అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో హవీష్ మాట్లాడుతూ ‘ఇదొక బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. త్రినాథరావు గారు బెస్ట్ స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రంలో ప్రతి యాక్టర్ బాగా పర్ఫార్మ్ చేశారు.
మిక్కీ జే మేయర్ మ్యూజిక్, నిజార్ విజువల్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’అని చెప్పాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని హీరోయిన్ కావ్య థాపర్ చెప్పింది.
డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ బొనాంజా మూవీ. అప్పట్లో ‘పెళ్లిసందడి’మూవీలో ఇండస్ట్రీలోని కమెడియన్స్ అంతా నటించారు. ఇందులో కూడా ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో కళకళగా ఉంటుంది.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కుటుంబంలో ఉండే సరదాలు, ఎమోషన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులంతా సకుటుంబంగా థియేటర్స్కు వచ్చి రెండున్నర గంటలు నవ్వుకుని, చివరి పదిహేను నిమిషాలు ఎమోషన్ ఫీల్తో బయటకు వెళ్తారు’అని చెప్పాడు.
ఈ చిత్రంతో ప్రొడ్యూసర్గా పరిచయమవడం ఆనందంగా ఉందని నిఖిల అన్నారు. నటులు గోపరాజు రమణ, బలగం సత్యనారాయణ, మాణిక్ రెడ్డి, జయవాణి, రూప లక్ష్మి, మహతి, హరితేజ, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్, స్టోరీ, డైలాగ్ రైటర్ విక్రాంత్ శ్రీనివాస్, ఎడిటర్ ప్రవీణ్ పూడి కార్యక్రమంలో పాల్గొన్నారు.