పెళ్లి కాలేదని సూసైడ్ చేసుకున్నాడు

పెళ్లి కాలేదని సూసైడ్ చేసుకున్నాడు

మంచిర్యాల జిల్లా  : పెళ్లి కాలేదని సూసైడ్ చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన బుధవారం మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన సతీష్ (39) పెళ్లి కావడంలేదని కొన్ని రోజులుగా మనస్థాపానికి గురయ్యాడు. 39 ఏళ్ల వయసొచ్చినా వివాహ యోగం లేదని కుంగి పోయాడు. దీంతో సతీష్ క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నాడు.

పెళ్లి కావడంలేదని.. జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నట్లు నాలుగు రోజుల క్రితం లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లి పోయాడని తెలిపారు కుటుంబ సభ్యులు. అయితే బుధవారం మంచిర్యాల జిల్లా, మహాదేవపురం మండలం, కాలేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌస్ దగ్గర సతీష్ మతదేహన్ని గుర్తించారు పోలీసులు. కొడుకు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.