రెంజల్​ రైతులు దీక్షలు విరమించాలి: బోధన్​ ఎమ్మెల్యే షకీల్​

రెంజల్​ రైతులు దీక్షలు విరమించాలి:  బోధన్​ ఎమ్మెల్యే షకీల్​

బోధన్, వెలుగు: రోడ్డు నిర్మాణం కోసం రెంజల్​మండల రైతులు కొనసాగిస్తున్న దీక్షలను వెంటనే విరమించుకోవాలని బోధన్​ఎమ్మెల్యే మహ్మద్​షకీల్​ కోరారు. శుక్రవారం ఆయన బోధన్ లోని తన నివాసంలో మాట్లాడారు. రెంజల్–బ్రహ్మణపల్లి గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి  రూ.3.70 కోట్లు మంజూరయ్యాయని, వారం రోజుల్లో టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. 

రెండేళ్ల క్రితమే రోడ్డు వేసేందుకు ఫండ్స్​ మంజూరైనా, కాంట్రాక్టర్​ చనిపోగా, కొత్త కాంట్రాక్టర్ ​నిర్మాణ పనుల్లో జాప్యం చేయడంతో ఆలస్యమైందన్నారు. తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేసినా, వర్షం కారణంగా పనులు చేసే పరిస్థితి లేదన్నారు.