రోడ్డుపై గుండు గీసుకుని నిరసన

రోడ్డుపై గుండు గీసుకుని నిరసన

కంది, వెలుగు: ఆశాకో కంపెనీలో అక్రమ లేఆఫ్‌ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు గుండు గీసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదివారం14వ రోజు ఆందోళనకు సీఐటీయూ నాయకుడు సాయిలు మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశా కో యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కంపెనీ కార్మికులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.