తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్పై మల్కాజ్ గిరి కోర్టులో విచారణ

తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్పై మల్కాజ్ గిరి కోర్టులో విచారణ

తీన్మార మల్లన్న అలియాస్  చింతపండు నవీన్ కుమార్  బెయిల్ పిటిషన్ పై మల్కాజ్ గిరి కోర్టు విచారణ జరిపింది.   రెండు రెగ్యులర్ బెయిల్స్, మరో ముందోస్తు బెయిల్ కలిపి విచారించాలంటూ మల్లన్న తరపు  న్యాయవాది శరత్ కోరారు. మూడు పిటిషన్లు ఒకేసారి విచారణ జరపడానికి అంగీకరించిన మల్కాజ్ గిరి కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 6 కు వాయిదా వేసింది.
 
తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి.  నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్ 3న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తీన్మార్ మల్లన్నపై పీటీ వారెంట్ జారీ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందని మల్లన్న తరపు న్యాయవాది వాదించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్, కవిత,మంత్రి కేటీఆర్ పై అనుచిత పదజాలంతో  తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ప్రభుత్వ అడ్వొకేట్ రూపేందర్ కోర్టుకు తెలిపారు.  వాదనలు విన్న హైకోర్టు..   తీన్మార్ మల్లన్నపై ప్రిజనర్ ఆన్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ దాఖలు చేయొద్దని పోలీసులకు  ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది.