
తిరుమలలో శుక్రవారం( జూన్ 13) నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. 'వేసవి రద్దీతో తిరుమలలో మే 15 నుంచి భక్తుల తాకిడి పెరిగింది. సాధారణంగా శుక్రవారం అభిషేకసేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శనం సాధారణంగా రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది.శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుండి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.
ALSO READ | తిరుమల: లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు.. బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం..
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఒక సారి దర్శన గుణాంకాలు పరిశీలిస్తే శుక్రవారాలైన మే 23న 74, 374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.