
తిరుమల లడ్డూ ప్రసాదంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది. జూన్ 8 న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు తనకు నోటిలో గాయమైందని నవీన్ కుమార్ అనే వ్యక్తి ఆరోపణలు చేశాడు. దీనిపై స్పందించిన టీటీడీ .. ఆ వ్యక్తికి తిరుమల అశ్విని ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహించారు. తరువాత స్విమ్స్ ఆస్పత్రిలో కూడా వైద్య పరిక్షల అనంతరం రిపోర్ట్ లో ఆయన ఆరోపణల్లో నిజం లేదని తేలింది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ అనే వ్యక్తి తిరుమల లడ్డూప్రసాదం తినేపమయంలో నాలుకను కొరుక్కోవడం వలన చిన్న గాయం అయిందని వైద్యబృందం రిపోర్ట్ద్వారా తెలిసింది. ఆ వ్యక్తి టీటీడీ నుంచి నష్ట పరిహారం పొందాలనే దురుద్దుశంతో సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేశాడని టీటీడీ తెలిపింది.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ... భక్తులను గందరగోళ పరిచేలా ఇలాంటి దురుద్దేశపూరిత ఆరోపణలు చేసిన నవీన్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.