తిరుమల: లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు.. బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం..

తిరుమల:  లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు.. బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం..

తిరుమల లడ్డూ ప్రసాదంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది.  జూన్​ 8 న  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు తనకు నోటిలో గాయమైందని నవీన్​ కుమార్​ అనే వ్యక్తి ఆరోపణలు చేశాడు.   దీనిపై స్పందించిన టీటీడీ .. ఆ వ్యక్తికి తిరుమల అశ్విని ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహించారు.  తరువాత స్విమ్స్​ ఆస్పత్రిలో కూడా వైద్య పరిక్షల అనంతరం రిపోర్ట్ లో ఆయన ఆరోపణల్లో నిజం లేదని తేలింది.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్​ అనే వ్యక్తి తిరుమల లడ్డూప్రసాదం తినేపమయంలో నాలుకను కొరుక్కోవడం వలన చిన్న గాయం అయిందని వైద్యబృందం రిపోర్ట్​ద్వారా తెలిసింది.  ఆ వ్యక్తి టీటీడీ నుంచి నష్ట పరిహారం పొందాలనే దురుద్దుశంతో సోషల్​ మీడియాలో  అసత్య ఆరోపణలు చేశాడని టీటీడీ తెలిపింది. 

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ... భక్తులను గందరగోళ పరిచేలా ఇలాంటి దురుద్దేశపూరిత ఆరోపణలు చేసిన నవీన్​పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.