
హైదరాబాద్, వెలుగు:కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పైనున్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో ఆదివారం గేట్లు ఎత్తనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రమే సాగర్ గేట్లూ ఎత్తే అవకాశముంది. ఇక గోదావరి బేసిన్లో ఎస్సారెస్పీకి ఓ మోస్తారు వరద కొనసాగుతోంది.