శంషాబాద్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు

శంషాబాద్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు

హైదరాబాద్‭లోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. శంషాబాద్ విమనాశ్రయాన్ని పొగమంచు కమ్ముకుంది. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు రహదారులు పూర్తిగా పొగమంచుతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 8 గంటల సమయంలో కూడా మంచుపొగ వదలకపోవడంతో.. లైట్లు ఆన్ చేసుకుని వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇక పలు విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‎కు వాతావరణం అనుకూలించక పోవడంతో చెన్నై విమానాశ్రయానికి విమానాలను దారి మళ్లించారు. ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానాన్ని AI 615ను చెన్నైకు దారి మల్లించారు. చెన్నై నుండి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానం 6E 495ను తిరిగి చెన్నైకు తరలించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.