భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 2, 3 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
రాగల 24 గంటల్లో ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్, కరీంనగర్, కుమురం భీమ్, మంచిర్యాల్, మేడ్చల్ -మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ మీదుగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అధికారులు వెల్లడించారు.