హైదరాబాద్,వెలుగు : సిటీలో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మబ్బులు పట్టి ఉండగా.. 5 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు గంట పాటు వాన కురిసింది. చాలా చోట్ల వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్జామ్ఏర్పడింది. సికింద్రాబాద్, అమీర్పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, అంబర్పేట, మాదాపూర్, ఫిలింనగర్తదితర ప్రాంతాల్లో భారీ వాన పడింది. వీకెండ్ కావడంతో సాయంత్రం ఇండ్ల నుంచి బయటకు రావడంతో వర్షంలో చిక్కిపోయారు.
బల్దియా డీఆర్ఎఫ్, వాటర్బోర్డు ప్రత్యేక బృందాలు, పోలీసులు వరద నిలిచిన చోట్ల ప్రమాదాలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దారు. ఈదురు గాలులు వీచడంతో చాలా రోడ్లపై చెట్టు కొమ్మలు విరిగిపడిపోయాయి. సిటీలో గరిష్టంగా 3.5 సెంమీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అమీర్పేట, చార్మినార్, హైటెక్సిటీ, మెహదీపట్నం, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 3 సెంమీ, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కాప్రా, మౌలాలి తదితర ప్రాంతాల్లో 3.2 సెంమీ వర్షపాతం మారేడ్పల్లిలో 2.9సెంమీ నమోదు అయినట్టు పేర్కొన్నారు. వర్షం కారణంగా విద్యుత్సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్సరఫరాను నిలిపివేశారు.