వర్షాలకు కూలిన మట్టిమిద్దె… ముగ్గురి మృతి

వర్షాలకు కూలిన మట్టిమిద్దె… ముగ్గురి మృతి

నాగర్ కర్నూలు జిల్లా:  నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర లో విషాదం నెలకొంది. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు భారీ చెట్లు.. కరెంటు స్తంబాలు నేలకొరుగుతున్నాయి. కుమ్మెర గ్రామంలో పాత మట్టి మిద్దె కూలిపోవడంతో ఒకే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హనుమంత్ రెడ్డి, అనసూయమ్మ, హర్షవర్ధన్ రెడ్డి గా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.