గురువారం రాత్రి హైదరాబాద్ను వాన ముంచెత్తింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జూబ్లీహిల్స్లో 9.8 సెం.మీ., ఖైరతాబాద్లో 6.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్, వెలుగు: రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ తెలిపింది. శనివారం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడవచ్చని అంచనావేసింది. గురువారం రాష్ట్రంలో హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలోని లోకరి(కే)లో అత్యధికంగా 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్నూర్లో 69 మిల్లీమీటర్లు, మేడ్చల్ జిల్లాలోని బాలానగర్లో 68.8 మిల్లీమీటర్లు, హైదరాబాద్జిల్లాలోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఐటీ క్యాంపస్లో 66.8 మిల్లీమీటర్లు, యూసుఫ్ గూడ, కృష్ణానగర్లో 64 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు
అధికారులు తెలిపారు.