- అధికారుల ప్రాథమిక అంచనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 12 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 13.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.
ఇలా దాదాపు రూ.2,900 కోట్ల మేర నష్టం జరిగినట్లు సమాచారం. వర్షాలు, వరదల నష్టంపై ప్రాథమిక అంచనాలతో రాష్ట్ర సర్కారు రిపోర్ట్ తయారు చేసింది. కొన్ని చోట్ల ఇంకా వరద తగ్గకపోవడంతో పూర్తి స్థాయిలో అంచనా వేయలేదని ఆఫీసర్లు చెప్తున్నారు.