తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ వెల్లడించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. మరోవైపు.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, వరంగల్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.