బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు(23,24,25 ల్లో) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ద్రోణి ప్రభావంతో జయశంకర్- భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రాజన్న-సిరిసిల్ల, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు జలాశయాల్లోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.