ఆగ‌స్ట్ 23, 24, 25 తేదీల్లో... తెలంగాణ‌లోని ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

ఆగ‌స్ట్ 23, 24, 25 తేదీల్లో... తెలంగాణ‌లోని ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు(23,24,25 ల్లో)  మోస్తరు నుంచి భారీ  వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ద్రోణి ప్రభావంతో జయశంకర్- భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రాజన్న-సిరిసిల్ల, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు జలాశయాల్లోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.