రోడ్లపై నిలిచిపోయిన వేలాది వాహనాలు.. శ్రీశైలం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

రోడ్లపై నిలిచిపోయిన వేలాది వాహనాలు.. శ్రీశైలం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

తుక్కుగూడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ విజయభేరి సభ కారణంగా శ్రీశైలం హైవేపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ప్రజలను ఆ మార్గంలో వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. రద్దీ కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు క్లోజ్ చేశారు. 

Also Read :- మాటంటే మాట.. అప్పుడు తెలంగాణ ఇస్తమన్నం.. ఇచ్చినం.. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేస్తం..

విజయభేరి సభ ముగియగానే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా సభ నుంచి బయటకు వచ్చారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తుక్కుగూడ విజయభేరి సభ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనాదారులు తెలిపారు. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు.