కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

కేదార్నాథ్లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న హెలికాఫ్టర్ కూలి ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు ప్రయాణికులు మరణించారు. ‘‘గరు చట్టీ సమీపంలో హెలికాఫ్టర్ కూలిపోయింది. ఇప్పటివరకు ఆరు మృతదేహాలను వెలికితీశాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’’ అని అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.