హైదరాబాద్: కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,నర్సులు, పోలీసు, జర్నలిస్టులు, ఆశ వర్కర్లు మరి ఇతర శాఖల్లో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఈరోజు సభ సంతాపం తెలియజేయాలి.. అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. చాలా మంది తమ కుటుంబాల్లో ఇష్టమైన వారిని కోల్పోయారని.. ఎంత ఖర్చు పెట్టి కొందరు ఆర్థికంగా నష్టపోయారు.. వాళ్లందరికీ ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోవాలి.. సభాపతికి ఇది నా ప్రార్థన అని ఆమె కోరారు.