సాగర్‌లో సాయం చేయండి.. వామపక్షాలకు కాంగ్రెస్ విజ్ఞప్తి

సాగర్‌లో సాయం చేయండి.. వామపక్షాలకు కాంగ్రెస్ విజ్ఞప్తి

నాగార్జునసాగర్ బైపోల్‌లో తమ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరుతూ.. కాంగ్రెస్ పీసీసీ కమ్యూనిస్ట్ పార్టీలకు లేఖలు రాసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఫోన్‌లో కూడా కమ్యూనిస్ట్ పార్టీల కార్యదర్శులతో మాట్లాడారు. ఉపఎన్నికలో జానారెడ్డి గెలిస్తే తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటాయన్నారు. రెండు రోజుల్లో సీపీఐ, సీపీఎం కార్యదర్శులతో చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.