నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తిరుపతిలో కొంత పార్ట్ చిత్రీకరించిన టీమ్.. ఈ రోజు (సోమవారం) నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ను మొదలుపెడుతున్నారు.
ఈ షెడ్యూల్లో నాగార్జున, ధనుష్ ఇద్దరూ పాల్గొంటారని తెలుస్తోంది. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ముంబాయి మాఫియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగ్, ధనుష్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను బిగ్ స్క్రీన్పై కలసి చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.