
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన 43వ ‘ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్’ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ అతిథిగా పాల్గొన్నాడు. ఆగస్టు 17న మాడిసన్ అవెన్యూలో సర్వే భవంతు సుఖినః అనే థీమ్తో జరిగిన ఈ వేడుకలో ప్రవాస భారతీయులతో పాటు స్థానిక అమెరికన్స్ కూడా హాజరయ్యారు. అక్కడి ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మువ్వన్నెల లైటింగ్ను విజయ్ దేవరకొండ స్విచ్చాన్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘ప్రవాస భారతీయ సోదరులు మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. దేశం కోసం వీళ్లు చేస్తున్న కాంట్రిబ్యూషన్ చూస్తుంటే గర్వంగా ఉంది. మన పెద్దలు ఎంతోమంది చేసిన త్యాగాలు, వారి కృషి వల్లే మనం ఈ రోజు ఇంత ఆనందంగా జీవించగలుగుతున్నాం’ అని చెప్పాడు.