గుజరాత్ లో పెద్దఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. సుమారు 50 కిలోల హెరాయిన్ ను గిర్ సోమనాథ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ 3వందల కోట్ల పైగా ఉంటుందన్నారు పోలీసులు. వెరావల్ నుంచి సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు.
ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు పోలీసు సూపరింటెండెంట్ మనోహర్సిన్హ్ జడేజా. పట్టుబడిన డ్రగ్స్అంతర్జాతీయ మార్కెట్లో రూ. 350 కోట్లు (కేజీకి రూ. 7 కోట్లు) విలువైనవని తెలియజేశారు.