ఓటీటీలోకి  హన్సిక ఎంట్రీ 

ఓటీటీలోకి  హన్సిక ఎంట్రీ 

హీరోయిన్‌‌గా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న హన్సిక.. తాజాగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఆమె లీడ్ రోల్‌‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌‌ ‘మైత్రి’. రాజేష్‌‌. ఎం డైరెక్ట్ చేస్తుండగా మూగెన్ రావు,  శంత‌‌ను భాగ్యరాజ్, జనని అయ్యర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదొక సైంటిఫిక్ ల‌‌వ్ ఎంట‌‌ర్‌‌టైన‌‌ర్‌‌. బుధవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబోగా, హ్యూమ‌‌న్‌‌గా హన్సిక రెండు పాత్రలు పోషించింది.

ముఖ్యంగా రోబోగా హ‌‌న్సిక లుక్‌‌, మ్యాన‌‌రిజ‌‌మ్స్ ఆకట్టుకున్నాయి. మిలియనీర్ అయిన ముగెన్ రావును మనుషులెవరైనా టచ్ చేస్తే ఎలర్జీ వస్తుంది. అతని కోసం సైంటిస్ట్ అయిన శంతను.. తన గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ పోలికలతో ఉన్న ఓ హ్యూమనాయిడ్ రోబోను తయారుచేస్తాడు. కానీ టెక్నికల్ గ్లిచ్‌‌ రావడంతో రోబోకు బదులు తన లవర్‌‌ను అతనితో పంపిస్తాడు. ఆమెతో మిలియనీర్ లవ్‌‌లో పడటం మిగతా కథ.

రోబో కాకపోయినా రోబోలా హన్సిక నటించే సీన్స్‌‌ హిలేరియస్‌‌గా ఉన్నాయి. ఈ నెల 15 నుంచి డిస్నీ ప్లస్‌‌ హాట్‌‌ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.