మళయాల బ్యూటీ మమతా మోహన్దాస్(Mamta Mohandas) ఇటీవల క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని జయించి తిరిగి సాధారణ స్థితిని ఆమె గడుపుతోంది. అయినా, సోషల్ మీడియాలో ఆమె ఆరోగ్యంపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మమత ఫైర్ అయ్యింది.
తన గురించి రాసిన ఓ ఆర్టికల్ నెట్టింట వైరల్ కావడంతో వాటిని పోస్ట్ చేస్తూ ఈ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అసలు మీకేం కావాలి? మీ పేజ్ రీచ్ పెరగడానికి ఇలా ఏదైనా రాసేస్తారా? నా గురించి రాయడానికి మీరెవరు?’.. అంటూ మండిపడింది. ఇలాంటివి దయచేసి ఎంకరేజ్ చేయొద్దని ఫాలోవర్స్ని కోరింది. దీంతో పోస్ట్ చేసిన సదరు గీతూ నాయర్ వెంటనే పేజీ డియాక్టివేట్ అయ్యింది.
సింగర్గా కెరీర్ మొదలు పెట్టిన మమతా మోహన్దాస్ యమదొంగ సినిమాతో తెలుగులో నటిగా మారింది. ఆ తర్వాత హీరోయిన్గా పలు సినిమాల్లోనూ నటించింది. క్యాన్స్ర్ను జయించి తన సెకండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టింది.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం మమతా మలయాళంలో దిలీప్తో బాంద్రా, తమిళంలో విజయ్ సేతుపతితో మహారాజా సినిమాలు చేస్తోంది. మమతా మోహన్ దాస్ తెలుగులో చింతకాయల రవి, యమదొంగ, కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాతో తెలుగులోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.