డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న పెళ్లి చూపులు మూవీ హీరోయిన్

డిజిటల్  ఎంట్రీ ఇస్తున్న పెళ్లి చూపులు మూవీ హీరోయిన్

పెళ్లి చూపులు’ చిత్రంతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయమై టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో  ప్రామిసింగ్ యాక్ట్రెస్‌‌‌‌‌‌‌‌గా  పేరు సంపాదించుకుంది రీతూ వర్మ.  తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తాజాగా ఆమె డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో నటిస్తోంది రీతూ వర్మ. తనదైన నటనతో  సిల్వర్ స్ర్కీన్‌‌‌‌‌‌‌‌పై మెప్పించిన ఆమె.. ఓటీటీ డెబ్యూతోనూ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే ఈ సిరీస్ వివరాలను ప్రకటించనున్నట్టు చెప్పారు. ఇక రీతూ వర్మ నటించిన ‘శ్వాగ్’ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

ఇందులో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో తను కనిపించనుంది. చాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతూ వర్మ..  రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్దమైంది. ఆమె ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఆమె క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.