
మోడలింగ్ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య ‘ఏజెంట్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత ‘గాండీవధార అర్జున’ సినిమాలో వరుణ్ తేజ్కు జంటగా నటించింది. తాజాగా మరో కొత్త ఆఫర్ అందుకుంది సాక్షి వైద్య. ఈసారి శర్వానంద్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. రీసెంట్గా ‘మనమే’ మూవీతో హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు తన 37వ సినిమాలో నటిస్తున్నాడు.
‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా సాక్షి వైద్యను ఫైనల్ చేసినట్టు బుధవారం ప్రకటించారు. ఇందులో ఆమె ఆర్కిటెక్ట్ నిత్య పాత్ర పోషిస్తున్నట్టు రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. బుధవారం ఆమె సెట్స్లో జాయిన్ అయ్యిందని మేకర్స్ తెలియజేశారు.
ఈ చిత్రానికి భాను బోగవరపు కథ అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.