భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్

భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్

ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు భారత వాయుసేన ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడవచ్చంటూ హెచ్చరించాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరం తిరిగి ప్రారంభమైందని.. పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు సరిహద్దు దగ్గరకు చేరుకుంటున్నారని ఇప్పటికే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా తెలిపారు. ఈ క్రమంలో భారత నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లపై ఆత్మాహుతి దాడులు చేపట్టాలని జైషే మహ్మద్ పక్కా ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్రానికి సమాచారం అందింది. దాంతో భారత వాయుసేన కేంద్రాల దగ్గర భద్రత రెట్టింపు చేశారు. అక్కడి స్కూళ్లను కూడా మూసివేశారు.