
హైదరాబాద్, వెలుగు: సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ సర్వీసు చేయని పక్షంలో రూ.50 లక్షల జరిమానా విధిస్తూ ప్రభుత్వం విధించిన నిబంధనల అమలును హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వ సర్వీసు నిమిత్తం కేటాయించిన సంబంధిత కాలేజీల్లో చేరాలంటూ వైద్యవిద్యాశాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. సూపర్స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసిన వారు ప్రభుత్వ సర్వీసు చేయాలన్న నిబంధనను ఉల్లంఘిస్తే రూ. 50 లక్షలు జరిమానా చెల్లిస్తామని బాండ్ సమర్పించాలన్న ప్రభుత్వ నిబంధనను సవాల్ చేస్తూ డాక్టర్ డి.అన్వేష్కుమార్రెడ్డి సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఇటీవల జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ విచారణ జరిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి