హైదరాబాద్, వెలుగు: ఫారెస్ట్ ఆఫీసర్ల డ్యూటీకి అవరోధం కలిగించారనే కేసులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కు కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది. 2006 మార్చి 11న ఆయనపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన లక్సెట్టిపేట జ్యుడిషియల్ మేజిస్ట్రేట్.. రమేశ్ రాథోడ్ కు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. రూ.3 వేల జరిమానాను విధించింది.
దీనిపై రాథోడ్ అప్పీల్ దాఖలు చేస్తే దానిని విచారించిన అదిలాబాద్ జిల్లా కోర్టు ఆ శిక్షను సవరించింది. దాంతో ఆయన 2008లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. కింది కోర్టు విధించిన శిక్ష తీర్పును రద్దు చేశారు.