జీవోలను ఎందుకు అమలు చేయలే : హైకోర్టు

జీవోలను ఎందుకు అమలు చేయలే : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ కేంద్రంగా రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల ఏర్పాటుకు జారీ చేసిన జీవోలను ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

2009, 2014ల్లో ఐటీడీఏల ఏర్పాటుకు 30/57 జీవోలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి తరఫున బానోతు శివ హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.